Panchayat elections | రెండో దశలో 415 సర్పంచులు ఏకగ్రీవం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి నెలకొంది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. చాలా గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో ప్రజలు సమష్టిగా నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా సర్పంచ్​, వార్డు సభ్యులను (Sarpanch and ward members) ఎన్నుకుంటున్నారు. మూడు దశల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి నెలకొంది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. చాలా గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో ప్రజలు సమష్టిగా నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా సర్పంచ్​, వార్డు సభ్యులను (Sarpanch and ward members) ఎన్నుకుంటున్నారు. మూడు దశల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

రెండో దశ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఏకగ్రీవం అయిన పంచాయతీల సంఖ్య తేలింది. రెండో దశలో ఏకంగా 415గ్రామాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్​, 38,342 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 415 మంది సర్పంచ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 8,304 వార్డులు సైతం యూననమస్​గా గెలుపొందడం గమనార్హం. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) 44 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో (Nalgonda and Nizamabad districts) 38 మంది చొప్పున సర్పంచులను యునానమస్​గా గెలిపించారు. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక సర్పంచ్​ మాత్రమే ఏకగ్రీవం అయ్యారు.

కాగా తొలిదశలో సైతం 395 సర్పంచ్​ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరగున్నాయి. 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్​ ఉంటుంది. మూడో విడత నామినేషన్ల విత్​డ్రా తర్వాత ఏకగ్రీవాల సంఖ్య తేలనుంది. ఈ ఏడాది పలు గ్రామాల్లో అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వేలం పాట ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...