Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​లో 31 మందికి జైలుశిక్ష

అక్షరటుడే, కామారెడ్డి : Drunk and Drive |  జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. గత రెండు రోజుల్లో 101 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. ఇందులో 31 మందికి కోర్టు ఒకరోజు జైలుశిక్ష విధించింది. Drunk and Drive | కామారెడ్డి పోలీస్​స్టేషన్​ పరిధిలో.. కామారెడ్డి పోలీస్​స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో 49 మందికి రూ.49 వేలు జరిమానా విధించగా ఇందులో 20 మందికి ఒక రోజు జైలుశిక్ష […]

అక్షరటుడే, కామారెడ్డి : Drunk and Drive |  జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. గత రెండు రోజుల్లో 101 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. ఇందులో 31 మందికి కోర్టు ఒకరోజు జైలుశిక్ష విధించింది.

Drunk and Drive | కామారెడ్డి పోలీస్​స్టేషన్​ పరిధిలో..

కామారెడ్డి పోలీస్​స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో 49 మందికి రూ.49 వేలు జరిమానా విధించగా ఇందులో 20 మందికి ఒక రోజు జైలుశిక్ష విధించింది. దేవునిపల్లి (Devunipalli) పరిధిలో 24 మందికి రూ.24 వేలు జరిమానా విధించగా ఇందులో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, తాడ్వాయి పరిధిలో ఒకరికి వెయ్యి జరిమానా, ఒకరోజు జైలుశిక్ష విధించారు. మాచారెడ్డి పరిధిలో ఐదుగురికి రూ.5వేలు జరిమానా ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష విధించింది. భిక్కనూరు పరిధిలో 14 కేసులు మందికి రూ.15 వేలు జరిమానా విధించగా ఇద్దరికి ఒకరోజు జైలుశిక్ష విధించింది. దోమకొండ (Domakonda) పరిధిలో ఐదుగురికి రూ.5 వేలు జరిమానా ముగ్గురికి ఒక రోజు జైలుశిక్ష, బీబీపేట్ పరిధిలో ఇద్దరికి రూ.2 వేలు జరిమానా, రాజంపేట్ పరిధిలో ఒకరికి రూ.వెయ్యి జరిమానా విధించింది.

జిల్లాలో గత రెండు రోజుల్లో మొత్తం 101 కేసులు నమోదు కాగా  కోర్టు రూ.1.01 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్​చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...