Land Auction | రాయదుర్గం భూమి వేలంలో రికార్డు ధర.. ఎకరానికి రూ.177 కోట్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | హైదరాబాద్‌(Hyderabad)లోని రాయదుర్గం ప్రాంతంలో భూమి వేలం మరోసారి రికార్డు సృష్టించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసీ నిర్వహించిన ల్యాండ్ వేలం(Land Auction)లో, ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఇది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో నమోదైన అత్యధిక ధర కావడం విశేషం. ఈ వేలంలో మొత్తం 7 ఎకరాలు 67 సెంట్లు భూమిని ఎంఎస్‌ఎన్ రియాలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం రూ.1,357 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | హైదరాబాద్‌(Hyderabad)లోని రాయదుర్గం ప్రాంతంలో భూమి వేలం మరోసారి రికార్డు సృష్టించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసీ నిర్వహించిన ల్యాండ్ వేలం(Land Auction)లో, ఎకరానికి రూ.177 కోట్లు పలికింది.

ఇది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో నమోదైన అత్యధిక ధర కావడం విశేషం. ఈ వేలంలో మొత్తం 7 ఎకరాలు 67 సెంట్లు భూమిని ఎంఎస్‌ఎన్ రియాలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం రూ.1,357 కోట్లు చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరానికి రూ.100-120 కోట్ల రేంజ్‌లోనే భూములు పలికేవి. కానీ ఈ సారి ధర భారీగా పెరిగి, మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

Land Auction | ఐటీ హబ్‌లో భూమి బంగారం

ఈ భూమి, టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో భాగం. నాలెడ్జ్ సిటీ, ఫార్మా సిటీ, ఐటీ కారిడార్‌కు మధ్యనున్న ఈ భూమి ఐటీ, ఫార్మా, బయోటెక్ కంపెనీల కార్యాలయాలకు అనువుగా ఉండటం, ధర పెరగడానికి ప్రధాన కారణం. ఈ ప్రదేశాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే యోచనలో ఉంది. ఈ వేలంలో అనేక ప్రముఖ సంస్థలు పాల్గొన్నప్పటికీ, అత్యధిక బిడ్ వేసిన ఎంఎస్‌ఎన్ రియాలిటీస్ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సంస్థ రాయదుర్గం పరిధిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. తాజాగా ఈ భూమిలో ఐటీ పార్కులు, కార్పొరేట్ ఆఫీసులు నిర్మించబోతున్నట్టు సమాచారం.

ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఈ ఫండ్స్‌తో మరిన్ని ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం ఏర్పడనుందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో రాయదుర్గం(Rayadurgam)లో భూముల ధరలు రెండింతలు పెరగడం, ఈ వేలంకి నిదర్శనం.ఈ వేలం ద్వారా రాయదుర్గం ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసింది. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టమవుతోంది. భవిష్యత్‌లో ఈ ప్రాంతం నేషనల్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య కేంద్రంగా మారనుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...