Yellareddy | ఎల్లారెడ్డిలో రెండోరోజు 148 నామినేషన్లు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) భాగంగా  ఎల్లారెడ్డిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారంతో నామినేషన్ల ప్రకియ ముగియనుంది. ఈ మేరకు సోమవారం రెండోరోజు ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు. నామినేషన్ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తూ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు వేశారు. ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy mandal) 31 గ్రామ పంచాయతీలకు మొదటి రోజు ఆదివారం సర్పంచ్​ స్థానాలకు 12 వార్డు సభ్యులకు 9 నామినేషన్లు వచ్చాయి. రెండో […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) భాగంగా  ఎల్లారెడ్డిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారంతో నామినేషన్ల ప్రకియ ముగియనుంది. ఈ మేరకు సోమవారం రెండోరోజు ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు.

నామినేషన్ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తూ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు వేశారు. ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy mandal) 31 గ్రామ పంచాయతీలకు మొదటి రోజు ఆదివారం సర్పంచ్​ స్థానాలకు 12 వార్డు సభ్యులకు 9 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సోమవారం సర్పంచ్ స్థానాలకు 49 నామినేషన్లు వార్డు సభ్యులకు 78 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా ఎల్లారెడ్డి మండలంలో 61 సర్పంచ్ అభ్యర్థులు 87 మంది వార్డు సభ్యులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

Yellareddy | రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్, తిమ్మారెడ్డి తండా గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ గ్రామంలో ఎన్నికలు లేకుండా అభివృద్ధిని చేసుకునేందుకు ఏకతాటిపై ఉండేందుకు ఏకగ్రీవాలను చేసుకున్నట్లు ఆయా గ్రామస్థులు తెలిపారు. ఆజామాబాద్ సర్పంచ్​గా కుమ్మరి మానస, ఉప సర్పంచ్​గా లింగంపల్లి సాయిలు, వార్డు సభ్యులుగా రావుల లక్ష్మి, చిన్నబోయిన నాగరాజు, కుమ్మరి లచ్చరాం, లింగంపల్లి సాయిలు, తుపాకీ ఏసుమణి, ప్రభుదాస్, శారదకాని సాయిలు, గాండ్ల కవితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Yellareddy | తిమ్మారెడ్డి తండాలో..

తిమ్మారెడ్డి తండా (Thimmareddy Thanda) గ్రామ పంచాయతీ సర్పంచ్​గా కోలరాములు నాయక్, ఉపసర్పంచ్​గా విస్లావత్ మాన్యా నాయక్​లను తండా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా గ్రామపెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు తీర్మానం చేశారు. వార్డు సభ్యులుగా జ్యోతి, గోవింద్, సాంగీబాయి, రవి, సునీత, మమత, మోహన్, మార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...