Nizamabad | బస్సు​లో సీటు కోసం బంగారం ఉన్న బ్యాగ్​ వేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?

అక్షరటుడే, ఇందూరు : Nizamabad | ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణం చేసే సమయంలో సీటు కోసం ప్రజలు పడే తిప్పలు అనేకం. బస్టాండ్​లోకి బస్సు రాగానే.. సీటు దక్కించుకోవాలని చాలా మంది కిటీకిల్లోనుంచి కర్చిఫ్​లు, టవాళ్లు, బ్యాగులు వేస్తుంటారు. అయితే ఓ మహిళ ఏకంగా మూడు తులాల బంగారం, సెల్​ఫోన్​ ఉన్న బ్యాగ్​ను సీటు కోసం కిటికీలో నుంచి వేసింది. బోధన్ (Bodhan) పట్టణానికి చెందిన సుగుణ అనే మహిళ శనివారం నిజామాబాద్ (Nizamabad) […]

అక్షరటుడే, ఇందూరు : Nizamabad | ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణం చేసే సమయంలో సీటు కోసం ప్రజలు పడే తిప్పలు అనేకం. బస్టాండ్​లోకి బస్సు రాగానే.. సీటు దక్కించుకోవాలని చాలా మంది కిటీకిల్లోనుంచి కర్చిఫ్​లు, టవాళ్లు, బ్యాగులు వేస్తుంటారు. అయితే ఓ మహిళ ఏకంగా మూడు తులాల బంగారం, సెల్​ఫోన్​ ఉన్న బ్యాగ్​ను సీటు కోసం కిటికీలో నుంచి వేసింది.

బోధన్ (Bodhan) పట్టణానికి చెందిన సుగుణ అనే మహిళ శనివారం నిజామాబాద్ (Nizamabad) నుంచి బోధన్ ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి సిద్ధమైంది. అధిక జనాలు ఉండడంతో బస్సులో సీటు కోసం కిటికీ నుంచి బ్యాగును వేసింది. తీరా బస్​ ఎక్కి చూడగా బ్యాగ్​ కనిపించలేదు. ఆ బ్యాగ్​లో మూడు తులాల బంగారు ఆభరణాలు, సెల్​ఫోన్​ ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే అక్కడ విధుల్లో ఉన్న హెడ్​ కానిస్టేబుల్​ పర్వేజ్​కు విషయం చెప్పింది. దీంతో ఆయన బస్​ అంతా తనిఖీ చేయగా.. వెనక సీటు కింద బ్యాగ్​ కనిపించింది. అందులోని బంగారం, సెల్​ఫోన్​ అలాగే ఉండటంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. అనంతరం పోలీసులు బ్యాగ్​ను ఆమెకు అప్పగించారు. దీంతో వారికి సుగుణ ధన్యవాదాలు తెలిపారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...