Telangana Govt | మంత్రికి తెలియకుండానే అనుమతులా.. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Govt | రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెర లేపారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కొంతకాలంగా సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సమయంలో యూసఫ్​గూడలో జరిగిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Govt | రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెర లేపారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కొంతకాలంగా సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సమయంలో యూసఫ్​గూడలో జరిగిన సినీ కార్మిక అభినందన సభలో సైతం పాల్గొనలేదు. సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్​లో ఐఏఎస్ అధికారిణి గురించి వచ్చిన కథనాన్ని శనివారం ఆయన ఖండించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పారు.

Telangana Govt |  రేట్ల పెంపుతో సంబంధం లేదు

పుష్ప 2 సినిమా విడుదల సమయంలో మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని ఆయన చెప్పారు. బాబు ట్రీట్మెంట్​కు కూడా తానే డబ్బులు ఇచ్చానని పేర్కొన్నారు. ఆ సినిమా అనంతరం టికెటు రేట్లు పెంచాలని తన వద్దకు రావొద్దని చెప్పానన్నారు. దీంతో తనను ఎవ్వరూ కలవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలు సినిమాల టికెట్ రేట్ల పెంపునకు, తాజాగా రాజాసాబ్​, మన శంకర వరప్రసాద్​ గారు సినిమా టికెట్​ రేట్ల పెంపునకు తనకు సంబంధం లేదన్నారు. అసలు ఆ ఫైళ్లు తన దగ్గరకు రాలేదని చెప్పారు. దీంతో సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా టికెట్​ రేట్లు ఎలా పెంచుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telangana Govt | తీవ్ర చర్చ

సినిమాటోగ్రఫి మంత్రి సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదని అనడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన ఇటీవల అఖండ 2 విడుదల సమయంలో సైతం భవిష్యత్​లో మూవీ టికెటు రేట్లు పెంచమని తెలిపారు. అయితే ఆయన మాటలను లెక్క చేయకుండా ప్రభుత్వం రాజాసాబ్​, మన శంకర వరప్రసాద్​ మూవీల టికెట్​ ధరల పెంపునకు అనుమతిచ్చింది. దీంతో సిని పెద్దల ఒత్తిడి మంత్రికి సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Telangana Govt | మేడారంలో కనిపించని కొండా సురేఖ

రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో జాతర జరగనుండటంతో అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఆ పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షించడం లేదు. జిల్లా మంత్రి సీతక్క, ఇన్​ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. గతంలో కొండా మురళి మేడారం పనులపై పలు ఆరోపణలు చేశారు. అనంతరం మంత్రి సురేఖ మేడారం పనుల విషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహిస్తున్నారు. జాతర ఆహ్వానాలు అందించడానికి వెళ్తున్న ఆమె పనుల పురోగతిపై మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ పనులను మంత్రి పొంగులేటి చూసుకుంటున్నారు.

Related articles

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...