అక్షరటుడే, ఇందూరు: Burgula Indira Vinod | ప్రజలతో మమేకమై డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని 41వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బూర్గుల ఇందిర వినోద్ (Burgula Indira Vinodhttps://www.aksharatoday.in/we-will-make-the-47th-division-a-model-division/) అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Burgula Indira Vinod | డివిజన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం..
తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రజల వెంటే ఉంటామని అభ్యర్థిని బూర్గుల ఇందిర వినోద్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం (central government) అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు నగర అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుధ్యం, అమృత్ పథకం ద్వారా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల అభివృద్ధి జరుగుతోందన్నారు.
41వ డివిజన్లో..
41వ డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని ఇందిర వినోద్ అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా, యువ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.