BJP Nizamabad | కార్పొరేషన్​పై కాషాయ జెండా ఎగరేస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | నిజామాబాద్​ కార్పొరేషన్​పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పాంగ్రా మాజీ సర్పంచ్, బీసీ స్థానిక నాయకులు అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై (BRS Party) ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. […]

అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | నిజామాబాద్​ కార్పొరేషన్​పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పాంగ్రా మాజీ సర్పంచ్, బీసీ స్థానిక నాయకులు అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై (BRS Party) ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.

BJP Nizamabad | బీజేపీపై నమ్మకంతో ఉన్నారు..

నగర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని దినేస్​ కులాచారి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు. అదే నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్​కర్ లక్ష్మీనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...