అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Panchareddy Anitha Suresh | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని.. తనను గెలిపిస్తే 16వ డివిజన్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని పంచరెడ్డి అనిత సురేష్ తెలిపారు. బుధవారం డివిజన్లోని దుబ్బ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Panchareddy Anitha Suresh | ప్రజలతో మమేకమై..
ఈ సందర్భంగా కాలనీల్లో అభ్యర్థిని పంచరెడ్డి అనిత సురేష్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) అధికారంలో ఉండడంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలులోకి వచ్చి పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. బీజేపీకి (BJP) ఓటు వేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
Panchareddy Anitha Suresh | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన..
కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) ద్వారా పేదలకు పక్కా ఇళ్లు అందుతున్నాయని పంచరెడ్డి అనిత సురేష్ వివరించారు. ఉజ్వల యోజన కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించిందని తెలిపారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం లభిస్తోందని చెప్పారు. పీఎం కిసాన్ పథకం (PM Kisan Scheme) ద్వారా రైతులకు ఆర్థికసాయం అందుతోందన్నారు.
Panchareddy Anitha Suresh | 16వ డివిజన్లో..
16వ డివిజన్లో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని అనిత సురేష్ తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.