HomeUncategorizedUNO | పాక్​కు ఐరాసలో చుక్కెదురు

UNO | పాక్​కు ఐరాసలో చుక్కెదురు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UNO | దాయాది దేశం పాకిస్తాన్​ pakistanకు ఐరాస uno భద్రతా మండలి చుక్కెదురైంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​–పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ పాక్​తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ దేశానికి నీరు వెళ్లకుండా ఆపేసింది. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాక్​ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకుండా సింధూ నది indus river జలాలను భారత్​ ఆపిందని సమావేశంలో చెప్పింది. దీనిపై భద్రతా మండలిలోని దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పహల్గామ్‌ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ చెప్పిన పలు అంశాలను తిరస్కరించాయి. సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించాయి.

UNO | పాక్​పై ప్రశ్నల వర్షం

ఇటీవల పాక్​ నేతల వ్యాఖ్యలను ఈ సందర్భంగా భద్రతామండలి సభ్యదేశాలు లేవనెత్తుతూ కీలక ప్రశ్నలు సంధించాయి. ఉగ్రదాడిలో లష్కరే తోయిబా Lashkar-e-Taiba ప్రమేయంపై పాక్‌ను ఐక్య రాజ్య సమితి ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పాక్​ వరుసగా క్షిపణి పరీక్షలు missile test చేయడంపై కూడా ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. అణుదాడులకు సిద్ధమని ఇటీవల పలువురు పాక్​ నేతలు మాట్లాడడంపై కూడా భద్రతా మండలిలోని దేశాలు నిలదీశాయి. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు.