ePaper
More
    HomeజాతీయంKubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్​లో (Madhya Pradesh)​ విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్ ధామ్‌లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇద్దరు భక్తులు మృతి చెందారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాదిలో ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తారు. ముఖ్యంగా కన్వర్​ యాత్ర (Kanwar Yatra) చేపట్టి గంగా జలాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో కుబ్రేశ్వర్ ధామ్‌లో పండిట్ ప్రదీప్ మిశ్రా కన్వర్ యాత్ర నిర్వహించనున్నారు. అయితే మంగళవారం ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    కుబ్రేశ్వర్ ధామ్ (Kubreshwar Dham) నుంచి చితావాలియా హేమా గ్రామం వరకు జరిగే కన్వర్ యాత్ర ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం భక్తులు ఒక రోజు ముందుగానే ఆలయానికి రావడం ప్రారంభించారు. అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు అనుకున్నదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులకు సౌకర్యాలు లేకపోవడం, భండార పంపిణీ, దర్శనం కోసం పరిమిత స్థలంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు (Devotees) మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    READ ALSO  Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్​.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

    Kubreshwar Dham Stampede | నాలుగు వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు

    ధామ్​ వద్ద 4 వేల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. నమక్ చౌరాహా, రాధేశ్యామ్ కాలనీ, బజరంగ్ అఖారా, అటల్ పార్క్, నగరంలోని ఇతర ప్రదేశాలలో నాలుగు వేలకు పైగా భక్తుల బస కోసం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒక రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట (Stampede) జరగడానికి ముందు ఉన్నతాధికారులు ధామ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. అయితే అధికారుల సూచనలు అమలు కాలేదు.

    కాగా.. ఇటీవల ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో గల మానసాదేవి ఆలయంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మానస దేవి ఆలయానికి జులై 27న భారీగా భక్తులు (Huge Devotees) వచ్చారు. అయితే ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విద్యుత్ వైర్​ తెగిపడడంతో షాక్​ కొడుతుందని పుకారు వ్యాప్తి చెందడంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. దాదాపు 55 మంది గాయపడ్డారు.

    READ ALSO  Bihar CM | బీహార్‌లో ఆగ‌ని వ‌రాల జ‌ల్లు.. ఆశ కార్మికుల వేత‌నం డ‌బుల్

    Latest articles

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    More like this

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...