Turmeric Farmers Protest | నిజామాబాద్​ మార్కెట్​ యార్డ్​లో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.

అక్షరటుడే, ఇందూరు: Turmeric Farmers Protest | నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు (Turmeric Farmers) గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.

Turmeric Farmers Protest | సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ పేరుతో..

సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ పేరుతో రెండురోజులుగా మార్కెట్​లో క్రయవిక్రయాలు జరపట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరంగా కాలయాపన చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము యార్డులోనే పడిగాపులు కాస్తున్నామంటూ అధికారులపై మండిపడ్డారు. ఒక దశలో కార్యాలయ తలుపులు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. అధికారులతో మాట్లాడారు.

నిజామాబాద్​ మొదటిస్థానం..

దేశంలోనే అత్యధికంగా పసుపు పండే జిల్లాలో నిజామాబాద్ (Nizamabad)మొదటి స్థానంలో ఉంటుంది. జాతీయ పసుపు బోర్డు కూడా నిజామాబాదులోనే నెలకొల్పారు. దీంతో మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్ మార్కెట్ యార్డు (Nizamabad Market Yard)కు భారీగా పసుపును తీసుకొస్తారు. సాధారణంగా ప్రభుత్వం పసుపు కొనుగోలును ‘ఈ నామ్’ యాప్ ద్వారా చేస్తుంది. ఆన్​లైన్​ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసి కమిషన్ ఏజెంట్లకు అందజేస్తుంది.

Related articles

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.