అక్షరటుడే, వెబ్డెస్క్ : H1B Visa | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) స్పందించారు.
వీసా దరఖాస్తు ఫీజు పెంపు నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎంతో మంది అమెరికాలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి వారికి ట్రంప్ నిర్ణయంతో నష్టం వాటిల్లుతుందని మంత్రి పేర్కొన్నారు. అమెరికా విధానాలు భారతదేశాన్ని, అక్కడ పనిచేస్తున్న చిన్న వ్యాపారాలను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు.
H1B Visa | అగ్రస్థానంలో భారత్
హెచ్1బీ వీసాలు పొందడంలో భారత్ మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన చాలా మంది అమెరికాలో నివసిస్తున్నారని చెప్పారు. వారు పంపించే డబ్బుతో ఇక్కడి వారు కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అమెరికాలో టీసీఎస్ (TCS)లో లక్ష మంది, విప్రో 80 వేలు, ఇన్ఫోసిస్ 60 వేల భారతీయులు పని చేస్తున్నారని చెప్పారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వారందరు ఇబ్బందులు పడుతారన్నారు.
H1B Visa | కేంద్రంపై ఆగ్రహం
మంత్రి శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయాలతో భారత పౌరులకు, దేశానికి నష్టం వాటిల్లుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమెరికాతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అంతమొత్తంలో దరఖాస్తు రుసుము వసూలు చేస్తే అమెరికాలోని భారతీయ కంపెనీలకు (Indian Companies) భారీ నష్టాలు వస్తాయన్నారు. దేశానికి సైతం ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఆయన మిత్రుడు మోదీ (Modi)కి బాగా తెలుసని శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు. దీనిపై మోదీ స్పందించాలని కోరారు.
