అక్షర టుడే, గాంధారి: Gandhari | మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో రాజేశ్వర్ (MPDO Rajeshwar) ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాతీయ ఎన్నికలకు (Gram Panchayat elections) సంబంధించి శిక్షణ అందించినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమం చేపట్టామని, ఇందులో 96 మంది పీవోలు, 92 మంది ఏపీఓలున్నారన్నారు.