అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | కేసీఆర్కు పేరు వస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఎల్బీ నగర్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి(TIMS Hospital)ని ఆయన పరిశీలించారు.
హరీశ్రావు(Harish Rao) మాట్లాడుతూ.. కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని సంకల్పించారన్నారు. ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఎర్రగడ్డలో వేయి పడకలు, నిమ్స్ 2 వేల పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారన్నారు. గతంలో ప్రభుత్వాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. పేదల కోసం నాలుగు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను తమ హయాంలో ప్రారంభించామన్నారు. అవసరమైన నిధులను కూడా కేసీఆర్ సమకూర్చాని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టిమ్స్ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని హారీశ్ రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఏడాది క్రితమే ఆస్పత్రి ప్రారంభించే వారమన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేస్తే కేసీఆర్(KCR)కు పేరు వస్తుందనే రేవంత్రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు రాజకీయాలు తప్ప పేదల సమస్యలు పట్టవన్నారు. ఎందుకు ఆస్పత్రుల నిర్మాణం ఆలస్యమైందని ఆయన ప్రశ్నించారు.
Harish Rao | జైల్లో వేసుకోండి
వరంగల్లో హెల్త్ సిటీని, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష ఉంటే తమపై కేసులు పెట్టుకోవాలని, జైలులో వేసిన సరే అని ఆయన అన్నారు. కానీ పేదలకు వైద్యం ఆపొద్దన్నారు. తాము గతంలో మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్రావు ఆరోపించారు. మహేశ్వరం మెడికల్ కాలేజీని ఎల్బీ నగర్ టిమ్స్లో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని అల్వాల్ టిమ్స్లో విలీనం చేశారన్నారు.
Harish Rao | బకాయిలు విడుదల చేయాలి
సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆరోగ్య శ్రీ చికిత్స పరిమితి రూ.10 లక్షలకు పెంచానని చెబుతున్నారని, కానీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వాళ్లు బంద్ చేస్తామంటున్నట్లు హరీశ్రావు చెప్పారు.కాంగ్రెస్ పాలనలో కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో ఆరోగ్య శ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించి పేదలకు వైద్యం అందేలా చూశామన్నారు. కానీ రేవంత్రెడ్డి రూ.1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టారని విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు.