అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | నగరంలోని పూలంగ్ పాత బ్రిడ్జి(Pulong Old Bridge) వద్ద ఓ ఇంట్లో చోరీ జరిగింది. 4వ టౌన్ పోలీసులు(4th town Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని చిన్నయ్య ఈనెల 23న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ (Hyderabad) వెళ్లారు. రెక్కీ వేసిన దుండగులు శనివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి 3 తులాల బంగారం, రూ.50 వేల నగదు చోరీ చేశారు. ఘటన స్థలానికి సీఐ(CI) శ్రీనివాసరాజు, ఎస్సై(SI) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Beaking News