ePaper
More
    HomeతెలంగాణUrea | రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా : ఎంపీ డీకే అరుణ

    Urea | రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా : ఎంపీ డీకే అరుణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Urea | రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలు, సొసైటీలకు పరుగులు తీస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోవడంతో సొసైటీల వద్ద బారులు తీస్తున్నారు. లైన్లలో చెప్పులు, పాస్​బుక్కులు పెట్టి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswhara Rao) కేంద్రానికి లేఖ రాశారు.

    రాష్ట్రానికి యూరియా కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో ఐదు లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా కోటాను కేంద్రం నిర్దేశిస్తే ఇప్పటివరకు 3.06 లక్షలు మాత్రమే వచ్చిందన్నారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని ఆయన లేఖలో కోరారు. కాగా యూరియా సరఫరాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని డీకే అరుణ సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...