BJP President | ఎంపీ అర్వింద్​ మాటలకు బీజేపీ కట్టుబడి ఉంది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP President | ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల​ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్​ పేరును ఇందూరుగా (Nizamabad to Indur) మారుస్తామన్నారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (President Ramchander Rao) స్పందించారు. ఎంపీ అర్వింద్​ (MP Dharmapuri Arvind) మాటలకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్​ నగరం పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. నిజామాబాద్ మాత్రమే కాదు, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP President | ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల​ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్​ పేరును ఇందూరుగా (Nizamabad to Indur) మారుస్తామన్నారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (President Ramchander Rao) స్పందించారు.

ఎంపీ అర్వింద్​ (MP Dharmapuri Arvind) మాటలకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్​ నగరం పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. నిజామాబాద్ మాత్రమే కాదు, మరెన్నో ప్రాంతాల్లోనూ పేర్లు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పేర్లు నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను మళ్లీ మళ్లీ మనకు గుర్తు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నిజాంపాలనలో తెలంగాణలోని పలు ప్రాంతాల పేర్లను మార్చారు. భాగ్యనగరాన్ని హైదరాబాద్​గా, ఇందూరును నిజామాబాద్​గా, ఎలగందులను కరీంనగర్​గా, ఎదులాపురంను ఆదిలాబాద్​గా మార్చారు. ఇలా అనేక ప్రాంతాల పేర్లను నిజాంల హయాంలో మార్చారు. బీజేపీ నాయకులతో ఎంతో కాలంగా వీటి పేర్లు మార్చాలని డిమాండ్​చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. పేర్ల మార్పుకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Related articles

IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.