అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Earthquake Tremors | తెలంగాణలో స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా (Mancherial District)లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై 3.9గా తీవ్రత నమోదు అయింది. మంచిర్యాల కు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే అర్ధరాత్రి ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.గోదావరి పరీవాహక ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఇలాంటి స్వల్ప భూకంపాలు ఐదు వచ్చినట్లు తెలిపారు. కాగా గతేడాది 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా ఇటీవల ఏపీలో సైతం భూ ప్రకంపలను చోటు చేసుకున్నాయి.
