Homeక్రీడలుBCCI | దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు టీమిండియా జట్టు ప్రకటన.. రీ ఎంట్రీ ఇచ్చిన పంత్​

BCCI | దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు టీమిండియా జట్టు ప్రకటన.. రీ ఎంట్రీ ఇచ్చిన పంత్​

దక్షిణాఫ్రికాతో టెస్ట్​ సిరీస్​కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొంతకాలంగా గాయంతో జట్టుకు దూరమైన రిషబ్​ పంత్​ ఈ సిరీస్​లో ఆడనున్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | దక్షిణాఫ్రికా (South Africa)తో టెస్ట్​ సిరీస్​కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. త్వరలో సౌత్​ ఆఫ్రికా భారత పర్యటనకు రానుంది. ఆ జట్టు భారత్​తో రెండు టెస్ట్​లు, మూడు వన్డేలు, ఐదు టీ–20లు ఆడనుంది.

దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్ట్ జట్టును సెలెక్షన్​ కమిటీ బుధవారం ప్రకటింది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, నవంబర్​ 22 నుంచి గువాహటి వేదికగా టెస్ట్​లు జరగనున్నాయి. ఇంగ్లాండ్​ టూర్​లో గాయపడి కొంతకాలంగా జట్టుకు దూరమైన రిషబ్​ పంత్ (Rishabh Pant)​ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడిని వైస్​ కెప్టెన్​గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఇండియా-ఎ, సౌతాఫ్రికా-ఎ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్టుల్లో పంత్ ఆడుతున్నాడు.

BCCI | అప్పుడు గాయం..

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సందర్భంగా రిషబ్​ పంత్​ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల బెంగళూరు (Bangalore)లో దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో ఇండియా ఎ జట్టుకు పంత్​ నాయకత్వం వహించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 113 బంతుల్లో 90 పరుగులు చేశాడు. గాయం కారణంగా వెస్ట్​ ఇండిస్​తో జరిగిన రెండు టెస్ట్‌లకు దూరమైన తర్వాత పేసర్ ఆకాష్ దీప్ (Akash Deep) కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో ప్రతిభ చూపిన మహ్మద్​ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. కాగా భారత్​, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens)లో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతిలో జరుగుతుంది.

BCCI | భారత జట్టు

శుభ్‌మన్‌ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.