అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) పేర్కొన్నారు. పట్టణంలోని శక్కర్నగర్, రాకాసీపేట్లో (Rakasipet) గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
పట్టణ శివారులోని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను, శక్కర్నగర్లోని వినాయకుల బావి వద్ద ఏర్పాట్లపై అధికారులకు సూచనలు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.