Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం చెల్లిన వాహనాల (ELVలు)కు ఇంధనం అందించకుండా చర్యలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi Chief Minister Rekha Gupta) పేర్కొన్నారు. సోమవారం(జూన్​ 30) ఆమె మీడియాతో మాట్లాడారు. “ఢిల్లీలో.. సుప్రీంకోర్టు, పొల్యూషన్​ నియంత్రణ సంస్థలు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తదితర సంస్థలు కాలం చెల్లిన వాహనాల (End-Of-Life Vehicles)ను దశలవారీగా […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం చెల్లిన వాహనాల (ELVలు)కు ఇంధనం అందించకుండా చర్యలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi Chief Minister Rekha Gupta) పేర్కొన్నారు. సోమవారం(జూన్​ 30) ఆమె మీడియాతో మాట్లాడారు.

“ఢిల్లీలో.. సుప్రీంకోర్టు, పొల్యూషన్​ నియంత్రణ సంస్థలు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తదితర సంస్థలు కాలం చెల్లిన వాహనాల (End-Of-Life Vehicles)ను దశలవారీగా తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి” అని గుప్తా గుర్తుచేశారు.

Delhi : బంకుల వద్ద కెమెరాల ఏర్పాటు..!

“ఇటువంటి వాహనాలకు ఇంధనం అందించకూడదు. దీనిని సమర్థవంతంగా ఎలా అమలు చేయవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంధన బంకుల వద్ద కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం” అని గుప్తా తెలిపారు.

Delhi : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా రెండు ప్రధాన సమస్యలను లేవనెత్తింది. ఢిల్లీలో కాలుష్యం, యమునా నది (Yamuna river) కాలుష్యం.. ఎన్నికైన తర్వాత ఈ రెండింటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచాక ఢిల్లీలోని భాజపా సర్కారు తాజాగా తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి చొరవ తీసుకుంటోంది.

గతంలో, సీఎం గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ జల్ బోర్డు.. రాజధాని నీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ట్యాంకర్ సేవలలో పారదర్శకతను పెంచడం, మురుగునీటి నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడం, భారీగా కలుషితమైన యమునా నదిని పునరుద్ధరించడం లక్ష్యంగా 45 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(45-point action plan)ను రూపొందించింది.

ఈ మేరకు యమునా నదిలో కాలుష్య పర్యవేక్షణ కోసం మొత్తం 67 ప్రదేశాలను గుర్తించారు. జులై నాటికి సర్వే నిర్వహించి, నివేదికను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించనున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope...

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...