అక్షరటుడే, ఇందూరు: PCC Chief Mahesh Kumar Goud | నగరంలోని పలు ఆలయాల్లో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ దంపతులు పూజలు నిర్వహించారు. శనివారం వారి పెళ్లిరోజు సందర్భంగా పోచమ్మ గుడి (Pochamma Gudi), గోల్ హన్మాన్ (Goal Hanuman Temple) ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వారితో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.