Homeతాజావార్తలుKaleshwaram Corruption | కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు షాక్​.. ఆస్తులను అటాచ్​ చేసిన ప్రభుత్వం

Kaleshwaram Corruption | కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు షాక్​.. ఆస్తులను అటాచ్​ చేసిన ప్రభుత్వం

Kaleshwaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. ముగ్గురు ఇంజినీర్ల ఆస్తులను అటాచ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​ నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్​ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు రూ.వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు.

ఆ అధికారులకు ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో మాజీ ఈఎన్​సీ సహా ఇంజినీర్లపై ఏసీబీ గతంలో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ ఈఎన్సీ మురళీధర్, ఈఈ నూనె శ్రీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్‌‌ నాయక్​ భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) గుర్తించారు. ఈ మేరకు వారి ఇళ్లలో సోదాలు జరిపి పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించారు. వారిని అరెస్ట్​ చేసి జైలుకు కూడా పంపారు. అయితే ఆ ముగ్గురు ప్రస్తుతం బెయిల్​పై బయటకు వచ్చారు. తాజాగా ప్రభుత్వం వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.

Kaleshwaram Corruption | జప్తు చేసిన విజిలెన్స్​ కమిషన్​

ఈఈ నూనె శ్రీధర్ (EE Nune Sridhar) ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అధికారులు జప్తు చేశారు. ఆయనకు సంబంధించి రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.110 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. బి.హరిరామ్‌‌కు చెందిన రూ.11.46 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. వీటి విలువ మార్కెట్​లో రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల అటాచ్‌ చేయాలని విజిలెన్స్‌కు ఇరిగేషన్ శాఖ అధికారులు (Irrigation Department Officers) లేఖ రాశారు. ఆయనకు సంబంధించిన రూ.100కోట్లకు పైగా ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ కేసు తేలే వరకు ఆ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీలు లేదు.