HomeతెలంగాణIAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు ఐఏఎస్​లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్​ రెడ్డి (NVS Reddy)ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ బాధ్యతలను సర్ఫరాజ్​ అహ్మద్​కు అప్పగించింది. 2009 బ్యాచ్​కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ ప్రస్తుతం మెట్రోపాలిటన్ కమిషనర్​గా కొనసాగుతున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్వీఎస్​ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన రెండేళ్ల పాటు పట్టణ రవాణా సలహాదారుగా కొనసాగనున్నారు.

శ్రుతి ఓజా స్టడీ లీవ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమెన్​ అండ్​ చైల్​ వెల్ఫేర్ డైరెక్టర్​గా నియమితులయ్యారు. ఇన్ని రోజులు శ్రీజనకు అప్పగించిన అదనపు బాధ్యతలను తొలగించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​గా కొనసాగుతున్న కృష్ణ ఆదిత్యకు TGSWREIS కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. సీతాలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించారు.

హెచ్​ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్​గా ఉన్న కోట శ్రీవత్సకు HMDA కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ స్థానంలో కొనసాగుతున్న ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే చీఫ్​ రేషనింగ్​ అధికారిగా రాజిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Must Read
Related News