అక్షరటుడే, ఇందూరు: Welfare Hostels | ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆర్సీవోలతో సమావేశం నిర్వహించారు.
Welfare Hostels | అప్రమత్తంగా ఉండాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) జరిగిన సంఘటన తరహా జిల్లాలో చోటు చేసుకోకుండా పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బాలికల హాస్టళ్లలో ఇతరులు ప్రవేశించకుండా కట్టడి చేయాలని, తల్లిదండ్రులు వస్తేనే ఇంటికి పంపాలని తెలిపారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, నీటి సరఫరా, ఆహార పరిశుభ్రత, పౌష్టికాహారం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు, గడ్డి పెరగకుండా చూడాలని.. పాముకాటు వంటి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
Welfare Hostels | ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి..
క్రమం తప్పకుండా హాస్టళ్లలో ఆరోగ్య శిబిరాలు (health camps) నిర్వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఫుడ్ పాయిజన్ సమస్యను నివారించడానికి శానిటేషన్ సిబ్బందికి, వంటగదిలో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు చేయాలన్నారు. వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నిలువ ఉంచిన నాన్వెజ్ అందించకూడదని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.