అక్షరటుడే, కోటగిరి : Bodhan Sub Collector | సాదాబైనామాలు త్వరగా పూర్తిచేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో (Sub-Collector Vikas Mahato) సూచించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయాన్ని (Kotagiri Tahsildar office) శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఉమ్మడి మండలాల రెవెన్యూ, జీపీవో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సయ్యద్ హుస్సేన్, ఆలియా బేగం, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
