అక్షరటుడే, వెబ్డెస్క్:Terror Attack | జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్(Pahalgam) దాడి వెనుక పాక్(Pak) హస్తం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని దర్యాప్తులో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. దాడిలో పాల్గొన్నవారి డిజిటల్(Digital) ఆధారాలను ముజఫరాబాద్, కరాచీలోని సేఫ్హౌస్(Safehouse)లలో ఉన్నట్లు భారతీయ నిఘా సంస్థలు గుర్తించాయి. అలాగే, 26/11 ముంబై దాడులలో ఉపయోగించిన రిమోట్ కంట్రోల్ రూమ్(Remote control room)ను తాజాగా ఉపయోగించినట్లు తేలడంతో దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని వెల్లడైందని అధికారులు తెలిపారు.
Terror Attack | అధునాతన ఆయుధాలతో దాడి..
మినీ స్విట్జర్లాండ్(Mini Switzerland)గా పిలిచే పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, అందులో ప్రధానంగా హిందువులను వెంటాడి మరీ చంపారు. మొత్తం 26 మంది మరణించగా, అందులో నేపాల్కు చెందిన వ్యక్తి ఒకరు కాగా, మిగతా వారు భారతీయులే ఉన్నారు. మారణకాండకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు ఏకే రైఫిల్స్(AK Rifles), అధునాతన కమ్యూనికేషన్ పరికరాలతో సహా ఆటోమేటిక్ ఆయుధాలతో(Automatic Weapons) వచ్చారని అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులకు పాక్ లాజిస్టిక్స్(Pak Logistics) సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు సైనిక తరహా దుస్తులు ధరించారని ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ వెల్లడైంది. “మా నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లో ఉన్న కార్యకర్తలతో వారికి (ఉగ్రవాదులకు) ప్రత్యక్ష సంబంధం ఉంది. ముజఫరాబాద్, కరాచీలోని కొన్ని సేఫ్హౌస్లకు గల డిజిటల్ ఆధారాలను మేము గుర్తించాము, ఇవి భారతదేశంలో లష్కరే తోయిబా(Lashkare Toiba) మునుపటి ప్రధాన దాడులకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి, వీటిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐనియంత్రణ కేంద్రాల నుంచి పర్యవేక్షిస్తాయి” అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Terror Attack | స్థానికుల సహకారం..
గత డిసెంబర్, జనవరిలో పాక్ నుంచి చొరబాట్లకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా, జైషే-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులను నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారతదేశంలోకి చొరబడటానికి చురుకుగా దోహదపడుతున్నాయని హెచ్చరించింది. ఫిబ్రవరి, మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ ) ఈ చొరబడిన ఉగ్రవాదులు(Terrorist), వారికి సహాయం చేస్తున్న స్థానికుల కోసం జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రదేశాలలో విస్తృతమైన సోదాలు నిర్వహించింది. ఇండియా(India)లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఉగ్రవాదులను స్థానికంగా ఉన్న కొందరు నడిపించారని, వారు వారికి ఆహారం, ఆశ్రయం, డబ్బును కూడా అందించారని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కథువా, ఉధంపూర్, దోడా, కిష్త్వార్, రియాసి, రాజౌరి, పూంచ్ వంటి లోతట్టు జిల్లాలకు, కాశ్మీర్ లోయకు కూడా వెళ్ళారని భావిస్తున్నట్లు ఎన్ఐఏ(NIA) మార్చిలోనే వెల్లడించింది. లోయలో ప్రస్తుతం 60 మంది వరకు శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని కాశ్మీర్లో నిఘా వ్యవహారాలను నిర్వహించే ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో సర్వర్లను కలిగి ఉన్న ఎన్క్రిప్టెడ్ రేడియో కమ్యూనికేషన్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారని తెలిపారు.
