అక్షరటుడే, వెబ్డెస్క్ : London | పాకిస్తాన్ pakistan తన తీరు మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని terrorism పెంచి పోషిస్తున్న ఆ దేశం బహిరంగంగానే వారికి మద్దతు తెలుపుతోంది. ఆ దేశ నాయకులతో పాటు అధికారులు భారతీయులపై విషం చిమ్ముతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack పాల్పడిన వారు స్వాతంత్య్ర సమరయోధులని పాక్ ఉప ప్రధాని శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లండన్లోని పాక్ హైకమిషర్లోని ఓ అధికారి భారతీయుల పీక కోస్తామంటూ సైగలు చేశాడు.
పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా లండన్లో london ఎన్ఆర్ఐలు NRI’s నిరసన తెలిపారు. పాకిస్తాన్ హై కమిషనర్ అధికారి వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పీక కోస్తామంటూ బెదిరింపులకు దిగాడు. అభినందన్ వర్దమాన్ చిత్రం చూపిస్తూ సైగలు చేయడం గమనార్హం. దీంతో భారతీయులు పాక్ హైకమిషన్ లోనికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సదరు అధికారి తీరును నిరసిస్తూ ఎన్ఆర్ఐలు అక్కడే నిరసన తెలిపారు. దీంతో లండన్ పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.