HomeజాతీయంRajnath Singh | ఆపరేషన్​ సిందూర్​ ట్రైలర్​ మాత్రమే.. పాక్​కు రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​

Rajnath Singh | ఆపరేషన్​ సిందూర్​ ట్రైలర్​ మాత్రమే.. పాక్​కు రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​

ఉత్తర ప్రదేశ్​లోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలివిడతలో ఉత్పత్తి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణులను సైన్యానికి అప్పగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh | పాకిస్థాన్​కు భారత రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​ ఇచ్చారు. ఇటీవల పాక్​ మంత్రులు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కౌంటర్​ ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్​లోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) సందర్శించారు. అక్కడ తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) ట్రైలర్‌ మాత్రమే అని, పాక్‌ దుస్సాహసానికి పాల్పడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

Rajnath Singh | స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం

లక్నో సాంకేతికత, పరిశ్రమల నగరంగా మారిందని రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. మే 11న ఏర్పాటు చేసిన కొత్త బ్రహ్మోస్ ఏరోస్పేస్ (Brahmos Aerospace) యూనిట్ జాతీయ భద్రత వైపు ఒక శక్తివంతమైన అడుగు అన్నారు. ఐదు నెలల్లోనే ఈ యూనిట్​లో క్షిపణులు తయారు చేయడంపై ఆయన అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణి ఆయుధం మాత్రమే కాదని, స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం అని అభివర్ణించారు. ఇది సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి వెన్నెముకగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Rajnath Singh | బ్రహ్మోస్​ పరిధిలో పాక్​

పాకిస్థాన్​ (Pakistan) ప్రతి అంగుళం భూమి ఇప్పుడు మన బ్రహ్మోస్ పరిధిలో ఉందని రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు. ఆపరేషన్​ సిందూర్​లో బ్రహ్మోస్​ పనితీరును ఆయన గుర్తు చేశారు. యూపీ పరివర్తనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కారణమని ప్రశంసించారు. లక్నోలోని యూనిట్​లో ఏటా సుమారు 100 క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేయొచ్చు. ఈ యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.