Kasturba School | కస్తూర్బాలో విద్యార్థుల ఇబ్బందులపై అధికారుల ఆగ్రహం.. త్వరలోనే కలెక్టర్​కు నివేదిక

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kasturba School | పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో వసతుల లేమిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కస్తూర్బాలో తహశీల్దార్​ ప్రేమ్, ఎంపీడీవో తాహెర బేగం, కస్తూర్బా జిల్లా అధికారి సుకన్య తనిఖీలు చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ (Collector Kamareddy) తనిఖీలకు ఆదేశాలివ్వగా వారు శుక్రవారం పరిశీలించారు. Kasturba School | పరిసరాలు అపరిశుభ్రం.. కస్తూర్బాలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్​పై అధికారులు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kasturba School | పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో వసతుల లేమిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కస్తూర్బాలో తహశీల్దార్​ ప్రేమ్, ఎంపీడీవో తాహెర బేగం, కస్తూర్బా జిల్లా అధికారి సుకన్య తనిఖీలు చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ (Collector Kamareddy) తనిఖీలకు ఆదేశాలివ్వగా వారు శుక్రవారం పరిశీలించారు.

Kasturba School | పరిసరాలు అపరిశుభ్రం..

కస్తూర్బాలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్​పై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీటి వసతి కల్పించకపోవడంపై మండిపడ్డారు. భోజనం సైతం సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులతో మాట్లాడిన అధికారులు జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. తమకు ఎలాంటి వసతులు కల్పించడంపై ప్రిన్సిపల్ శ్రద్ధ చూపడం లేదని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Kasturba School | అపరిశుభ్రంగా నీటివ్యవస్థ..

పాఠశాలలో నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉండడంతో తమకు చర్మ సంబంధిత వ్యాధులు (Skin diseases) వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ట్యాంక్​ పాకురు పట్టి అపరిశుభ్రంగా ఉందని విద్యార్థులు అధికారులకు చూపించారు. భోజనం సైతం సక్రమంగా ఇవ్వడం లేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి నివేదికను జిల్లా కలెక్టర్​కు అందజేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో భోజనం చేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.