అక్షరటుడే, కామారెడ్డి: National seminar Kamareddy college | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) జాతీయ సెమినార్ (National seminar) నిర్వహణకు ముస్తాబవుతోంది. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
National seminar Kamareddy college | 60ఏళ్ల సుదీర్ఘ చరిత్ర..
60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి, న్యాక్ ‘ఏ’ గ్రేడ్(NAAC A Grade) సాధించిన ఈ కళాశాల ఇప్పుడు జాతీయ స్థాయి అతిథులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సెమినార్ ఏర్పాట్లలో భాగంగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.
పరిసరాల పరిశుభ్రతతో పాటు పెయింటింగ్ పనులు పూర్తి చేసి చేసినట్లు తెలిపారు. అత్యాధునిక డిజిటల్ సెమినార్ హాల్ను సిద్ధం చేశామని, ఈ సెమినార్కు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, విశ్లేషకులు రానున్నారని తెలిపారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్..
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(Telangana State Higher Education Council) ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ప్రస్తుత రేరా ఛైర్మన్, పూర్వ కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తదితరులు హాజరుకానున్నట్లు వివరించారు. నూతన విద్యా విధానంలో మార్పులు, దేశాభివృద్ధిలో ఉన్నత విద్య ప్రాధాన్యతపై ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను ఈ సెమినార్లో సమర్పించనున్నారని పేర్కొన్నారు.
ఈ జాతీయ సెమినార్ నిర్వహణ ద్వారా కళాశాల ర్యాంకింగ్ను, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉందన్నారు. ప్రతిష్టాత్మకమైన మా కళాశాలలో ఈ సెమినార్ నిర్వహించడం వల్ల విద్యాపరంగా కళాశాల కీర్తి మరింత పెరుగుతుందని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య తెలిపారు.
ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య

