ePaper
More
    HomeతెలంగాణNizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ను విజయవంతం చేయాలి

    Nizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ను విజయవంతం చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత జిల్లా లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డ్రగ్స్‌ వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు బలోపేతం చేయాలన్నారు. 25న మాదకద్రవ్యాల నియంత్రణ అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారిణి రసూల్‌ బీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో నిజామాబాద్‌ జోన్‌ డీఎస్పీ సోమనాథం, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, డీఐఈవో రవికుమార్‌ పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...