Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | రూ.2 వేల కోసం హత్య.. నిందితుడి అరెస్ట్​

Nizamabad | రూ.2 వేల కోసం హత్య.. నిందితుడి అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నగరంలో దారుణం చోటు చేసుకుంది. రూ.రెండు వేల కోసం ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన 25 రోజుల క్రితం జరగ్గా.. పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్​ చేశారు.

నిజామాబాద్​ నగరంలోని ఒకటో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 25 రోజుల క్రితం ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్డు పక్కన పడుకున్న ఆ వ్యక్తిని నిందితుడు వైర్​తో ఉరి వేసి చంపేశాడు. వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కోటగిరి మండం జైనపూర్​కు చెందిన హైమద్ రూ.రెండు వేల కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని చంపేసి, అతడి జేబులో ఉన్న రూ.2 వేలు తీసుకొని పారిపోయాడన్నారు. ఈ మేరకు హైమద్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.