ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha Suspention | ఎమ్మెల్సీ కవితపై వేటు..! సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్​

    MLC Kavitha Suspention | ఎమ్మెల్సీ కవితపై వేటు..! సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha Suspention | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (MLC Kalvakuntla Kavitha) బీఆర్​ఎస్​ పార్టీ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీలోని పలువురు నేతలను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో తన తండ్రికి రాసిన లేఖ బయటకు విడుదల కావడంతో కేసీఆర్​ (KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె విమర్శించారు. బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేయాలని చూశారని ఆమె గతంలో బాంబు పేల్చారు. బీఆర్​ఎస్​లో కేసీఆర్​ మాత్రమే బాస్​ అని పరోక్షంగా తన అన్న కేటీఆర్​ (KTR) నాయకత్వాన్ని అంగీకరించేది లేదని వ్యాఖ్యలు చేశారు.

    MLC Kavitha Suspention | హరీశ్​రావుపై వ్యాఖ్యలతో..

    కవిత కొంతకాలం క్రితం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై (MLA Jagadish Reddy) సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆమె కాళేశ్వరంపై (Kaleshwaram) మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao), మాజీ ఎంపీ సంతోష్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతి వారే కారణమని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. వారి తీరుతో కేసీఆర్​కు మరకలు అంటాయన్నారు. పార్టీ ఏమైపోయినా పర్వాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

    MLC Kavitha Suspention | కార్యకర్తల ఆగ్రహం

    ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఆమె తీరుపై బీఆర్​ఎస్​ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని బీఆర్​ఎస్​ (BRS Party) చెబుతుంటే.. స్వయంగా కేసీఆర్​ కుమార్తె కవిత అవినీతి జరిగిందని ఒప్పుకోవడంతో కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్​ సోమవారం రాత్రి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం మరోసారి సమావేశం నిర్వహించి కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

    MLC Kavitha Suspention | ప్రాంతీయ పార్టీల్లో గతంలో సైతం

    ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రావడంతో గతంలో సైతం కుటుంబ సభ్యులను బహిష్కరించారు. శివసేన అధినేత బాల్​ థాకరే (Shiv Sena chief Bal Thackeray) తన అన్న కుమారుడు రాజ్​ థాకరేను 2005లో సస్పెండ్ చేశారు. ములాయం సింగ్​ యాదవ్​ తన కుమారుడు అఖిలేష్​ యాదవ్​ను 2016లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో అఖిలేష్​ సీఎంగా ఉండటం గమనార్హం.

    More like this

    Yellareddy | టెండర్ల స్వీకరణలో గందరగోళం.. దరఖాస్తుదారుల ఆందోళన

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | బాన్సువాడ (Bansuwada) ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి నూతన బస్టాండ్​లో...

    Kamareddy | అంతర్రాష్ట్ర దొంగపై పీడీ యాక్ట్​ నమోదు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అంతర్రాష్ట్ర దొంగపై పీడీ యాక్టు (PD Act) నమోదు చేసినట్లు మంగళవారం జిల్లా...

    SP Rajesh Chandra | అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్​

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా (Interstate...