ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPocharam Project | పోచారం ప్రాజెక్టు‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్​

    Pocharam Project | పోచారం ప్రాజెక్టు‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్​

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్టును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ (Mla Madan Mohan) శుక్రవారం సందర్శించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని 103 ఏళ్ల ఈ ప్రాజెక్టు ఇటీవల 1.83 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సైతం ఎదుర్కొని నిలబడింది.

    అయితే ప్రాజెక్టు వద్ద మట్టికొట్టుకుపోయింది. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.  ఆ ప్రాంతంలో ఇసుక సంచులను వేసి గుంతను పూడ్చివేస్తున్నారు.

    ప్రాజెక్టు వద్ద సుమారు 800 ఇసుక సంచులను వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గించారు. రెండురోజుల నుంచి ప్రాజెక్టు వద్ద భారీ గుంతను పూడ్చేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ(Yellareddy Constituency) ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వరద నష్టం వివరాలను, నష్టపరిహారం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఈ, డీఈఈ, ఆర్డీవో, డీఎస్పీ, ఎస్డీఆర్​ఎఫ్​ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...