Homeతాజావార్తలుASO Transfers | సచివాలయంలో భారీగా ఉద్యోగుల బదిలీలు

ASO Transfers | సచివాలయంలో భారీగా ఉద్యోగుల బదిలీలు

రాష్ట్ర సచివాయంలోని పలువురు ఉద్యోగులను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. 134 మంది ఏఎస్​వోలకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్​ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ASO Transfers | రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను (Assistant Section Officers) బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ సచివాలయంలో (Dr. BR Ambedkar Secretariat) పలు విభాగాల్లో పని చేస్తున్న ఏఎస్​వోలకు ప్రభుత్వం స్థానచలనం కలిగింది. సెక్రటేరియట్​ పరిధిలోనే వారిని ట్రాన్స్​ఫర్​ చేసింది. మొత్తం 134 మంది ట్రాన్స్​ఫర్లు, పోస్టింగ్​లు (transfers and postings) ఇస్తూ సీఎస్​ ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. వీరిలో జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. కాగా.. ఒకే శాఖలో ఏళ్లుగా పని చేస్తున్న ఓ ఏఎస్​వోను సైతం ​ట్రాన్స్​ఫర్​ చేయడం గమనార్హం.

ప్రభుత్వం జనవరిలో సైతం ఒకేసారి 177 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. లీకులను అరికట్టేందుకే ఈ స్థాయిలో భారీగా బదిలీలు చేపట్టారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి భారీగా బదిలీలు చేపట్టడం గమనార్హం.

Must Read
Related News