అక్షరటుడే, బోధన్ : Bodhan Police | వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులకు గంజాయి లభ్యమైంది. ఈ ఘటన బోధన్ (Bodhan) పట్టణ శివారులో చోటు చేసుకుంది.
బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బిలోలి నుంచి బోధన్ వస్తున్న ఆటోను పోలీసులు తనిఖీ చేశారు. ఆటోలో బిలోలికి చెందిన గోనివర్ గణేష్, బోధన్కు చెందిన శేఖర్, షేక్ అబ్దుల్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కిలో 270 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు బిలోలి (Biloli) నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు.
