అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే భారీగా నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీ బాధితులు నామినేషన్లు వేయడానికి తరలి వచ్చారు.
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by Election) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ (Congress) యత్నిస్తుండగా.. తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ శ్రమిస్తోంది. బీజేపీ (BJP) మాత్రం ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా.. ప్రచారంలో వెనక బడింది. అయితే నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. మంగళవారం చాలా మంది నామినేషన్ వేయడానికి తరలి వచ్చారు. దీంతో షేక్పేటలోని ఆర్వో కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది.
Jubilee Hills | పెద్ద సంఖ్యలో నామినేషన్లు
ఉప ఎన్నికల కోసం శనివారం సాయంత్రం వరకు 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు వచ్చాయి. ఆదివారం, సోమవారం సెలవు కావడంతో మంగళవారం చివరి రోజు నామినేషన్ వేయడానికి చాలా మంది వచ్చారు. రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా పోటీకి సై అంటున్నారు. నిరుద్యోగులు, ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు తమ సమస్యను తెలపడానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రిటర్నింగ్ ఆఫీసు వద్ద సందడి నెలకొంది.
Jubilee Hills | ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నవీన్యాదవ్, బీఆర్ఎస్ (BRS) మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్ ఫైల్ చేశారు. పలు చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది నామినేషన్ వేశారు.