అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nallamadugu Surender | కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం తెలంగాణకే అవమానమని.. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Nallamadugu Surender) విమర్శించారు. కేసీఆర్కు సిట్ నోటీసులు (SIT notices) ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Nallamadugu Surender | రాష్ట్రాన్ని నంబర్వన్గా నిలబెట్టిన నేత కేసీఆర్..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణను సాధించి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని వారు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
Nallamadugu Surender | ప్రజల దృష్టి మళ్లించేందుకే..
ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కాళేశ్వరం కమీషన్లు, సిట్, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను ఇప్పుడు కేసీఆర్ వేధిస్తున్నారన్నారు. ప్రస్తుత మంత్రివర్గాన్ని ‘దండుపాళ్యం బ్యాచ్’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ మంత్రులంతా రోజుకో కుంభకోణానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్రావు ఇప్పటికే బొగ్గు స్కాం, సోలార్ పవర్ స్కాం, సింగరేణి డీజిల్ స్కాం, మద్యం స్కాంలను బయటపెట్టారని గుర్తుచేశారు. ఈ స్కాంల నుండి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్కు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను తాకితే యావత్ తెలంగాణలోని కార్యకర్తలంతా కలిసి కాంగ్రెస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు.
Nallamadugu Surender | రానున్న మున్సిపల్ ఎన్నికల్లో..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పనిచేయకుండా, కేసుల చుట్టూ తిరిగేలా చేయాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ఈ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కేసీఆర్ను వేధిస్తే ఆ ఉసురు ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగలకుండా పోదని హెచ్చరించారు. న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయని, ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటే ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.