అక్షరటుడే, వెబ్డెస్క్ : IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్ అధికారి సునీల్నాయక్కు ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయంలో అప్పటి ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Assembly Deputy Speaker) రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసిన విషయంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఐపీఎస్ సునీల్ నాయక్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీహార్ కేడర్కు చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. అయితే నాటి ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnam Raju), కస్టడీలో ఆయనను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆయన తన డిప్యుటేషన్ను రద్దు చేసుకుని మళ్లీ బీహార్కు వెళ్లారు.
IPS Sunil Naik Lookout Notice | అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ సునీల్ నాయక్పై కేసు నమోదు అయింది. పోలీసులు గతంలో నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. గుంటూరు కోర్టు (Guntur Court)లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దానికి ఇటీవల కోర్టు కొట్టు వేసింది. దీంతో ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడానికి బీహార్కు వెళ్లారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే బీహార్ పోలీసులు (Bihar Police) అతడిని విడిపించుకొని తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సునీల్ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు అక్కడే మకాం వేశారు. దీంతో ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
