అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ippakayala Sumitra Kishore | ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయమని.. నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని 24వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) ఇప్పకాయల సుమిత్ర కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో విస్తృతంగా పర్యటించారు.
Ippakayala Sumitra Kishore | జనసేవకురాలిగా ఉంటా..
ఈ సందర్భంగా ఇప్పకాయల సుమిత్ర కిషోర్ కాలనీలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కలిశారు. బీజేపీకి (BJP) ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్లో ప్రతిఒక్క సమస్యపై అవగాహన ఉందన్నారు. అవకాశం ఇస్తే వాటిని పరిష్కరించి ముందుకు వెళ్తానన్నారు.
బీజేపీ ప్రజాప్రతినిధుల సహకారంతో..
ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సహకారంతో డివిజన్కు భారీగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని సుమిత్ర కిషోర్ అన్నారు. ‘మన ఇందూరు – మన మేయర్’ నినాదంతో ముందుకు వెళ్తామని.. ప్రతిఒక్కరూ తమకు మద్దతు తెలిపాలని వారు కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.