HomeUncategorizedIndia - America | అమెరికాకు షాకిచ్చిన భారత్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు!

India – America | అమెరికాకు షాకిచ్చిన భారత్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India – America | అమెరికాకు భారత్​ భారీ షాక్​ ఇచ్చింది. రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటుందనే సాకుతో యూఎస్​ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​(US President Donald Trump) భారత్​పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్​ చర్యలకు తలొగ్గని భారత్​.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. తాజాగా అమెరికా(America)తో కీలక ఒప్పందాన్ని భారత్​ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్​ టారిఫ్​(Trump Tariffs)లకు కౌంటర్​గా.. యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకోవడానికి సిద్ధ అయినట్లు సమాచారం.

 India – America | ఆరు విమానాల కొనుగోలుకు ఒప్పదం

అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన P81 జెట్ల కొనుగోలుకు భారత్​ 2021లో ఒప్పందం చేసుకుంది. 2.24 బిలియన్​ డాలర్లతో ఒప్పందం చేసుకోగా.. అనంతరం దాని వ్యయం 3.6 బిలియన్​ డాలర్లకు పెరిగింది. సముద్ర గస్తీ కోసం బోయింగ్​ కంపెనీ(Boeing Company) నుంచి ఈ విమానాలు కొనుగోలు చేయాలని భారత్​ భావించింది. అయితే ఈ విమానాల ముడి సరుకులు భారత్​ నుంచే అమెరికాకు ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్​ సుంకాలు పెంచడంతో విడిభాగాల ధరలు పెరగనున్నాయి. దీంతో విమానాల వ్యయం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ డీల్​ను రద్దు(Cancel  Deal) చేసుకోవాలని భారత్​ నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

India – America | భారత్​కు రష్యా ఆఫర్​

రష్యా నుంచి భారత్​ ఆయిల్​ దిగుమతి(Oil Import) చేసుకోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్​పై ట్రంప్​ సుంకాలు విధించారు. ఈ క్రమంలో రష్యా భారత్​కు అండగా నిలిచింది. అమెరికా వైఖరిని తప్పు పట్టింది. అంతేగాకుండా మరింత తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది.

 India – America | త్వరలో భారత్​కు పుతిన్​

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval) రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​(Russian President Putin)తో ఆయన సమావేశంపై కీలక చర్చలు జరిపారు. ట్రంప్​ టారిఫ్స్​ వేళ ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ ఏడాది చివరలో రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత్​ రానున్నట్లు ఆయన ప్రకటించారు.