Kakatiya Institutions | సైబర్ క్రైం జరిగితే గోల్డెన్ అవర్​లో ఫిర్యాదు చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Kakatiya Institutions | సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం ఎస్పీ సాయిశ్రీ (Cybercrime SP Sai Sri) సూచించారు. కాకతీయ ఇనిస్టిట్యూట్​ (Kakatiya Institute) ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మొదటి గంటను గోల్డెన్ అవర్​గా గుర్తించి 1930కు కాల్ చేయాలని సూచించారు. Kakatiya Institutions […]

అక్షరటుడే, ఇందూరు: Kakatiya Institutions | సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం ఎస్పీ సాయిశ్రీ (Cybercrime SP Sai Sri) సూచించారు. కాకతీయ ఇనిస్టిట్యూట్​ (Kakatiya Institute) ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మొదటి గంటను గోల్డెన్ అవర్​గా గుర్తించి 1930కు కాల్ చేయాలని సూచించారు.

Kakatiya Institutions | డేటింగ్​ యాప్​తో మోసాలు..

సైబర్​ క్రైం (cyber crime) జరిగితే ముందుగా ఎటువంటి ఆందోళన చెందకుండా పోలీసులకు తెలపాలన్నారు. ప్రధానంగా డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లియింగ్, సైబర్ స్టాకింగ్, మాట్రిమోనియల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలపై కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, వాటిని గుర్తిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​ మాట్లాడుతూ.. సైబర్​ నేరాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికి బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సూచించారు.  కార్యక్రమంలో డీసీపీ బస్వారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి సీసీఎస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Related articles

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...