అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Komatireddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విద్యా శాఖ మంత్రి (Education Minister)గా అవకాశం వస్తే కార్పొరేట్ స్కూళ్లను బంద్ చేయిస్తానన్నారు.
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి పేరిట కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను పునర్నించారు. నల్గొండ జిల్లా (Nalgonda District) బొట్టుగూడలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను రూ.8 కోట్లతో అన్ని సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో ప్రతీక్ ఫౌండేషన్ (Prateek Foundation) పునర్నిర్మాణం చేసింది. సెంట్రల్ ఏసీ, డిజిటల్ క్లాసెస్తో నాలుగు అంతస్థుల భవనం నిర్మించింది. ఈ బడిలో ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్లు, ఆడియో, వీడియో పాఠాలతో పాటు ఆటబొమ్మలతో పిల్లలకు శిశుతరగతులు నిర్వహించనున్నారు. పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
Minister Komatireddy | వాళ్లు దొంగలు
విద్యా వ్యవస్థపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలు యాజమాన్యాలు పెద్ద దొంగలన్నారు. తమ మనుషులమని చెప్పగానే కాలేజీ ఫీజును రూ. లక్ష పెంచుతారన్నారు. అనంతరం తాను ఫోన్ చేస్తే దానిని తగ్గిస్తారని చెప్పారు. ఆ కాలేజీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిందన్నారు. కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) విద్యను అమ్ముకుంటున్నాయన్నారు. విద్యా వ్యాపారం కాదన్నారు.కార్పొరేట్ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారు మాత్రమే చదువు చెబుతారన్నారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో (Government Colleges) పీహెచ్డీలు చేసిన వారు ఉంటారని చెప్పారు. ఎంతో టాలెంటెడ్ అధ్యాపకులు ఉన్నా.. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరడం లేదన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో బట్టి పట్టించడంతో ఎంతో మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.