అక్షరటుడే, హైదరాబాద్: Gunfire | గ్రేటర్ హైదరాబాద్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కోఠి ఎస్బీఐ కార్యాలయం వద్ద దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతడి నుంచి రూ.6 లక్షలకు పైగా దోచుకున్నారు. డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఆయనపై గన్తో షూట్ చేశారు.
హైదరాబాద్ Hyderabad నగరంలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న కోఠి ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రధాన కార్యాలయం సమీపంలో సినీ ఫక్కీలో జరిగిన కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఇవాళ ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడిలో రషీద్ కాలికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు అతడి వద్ద ఉన్న సుమారు రూ.6 లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
Gunfire : సినీ స్టైల్లో..
కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే రషీద్ను గమనించి సహాయం అందించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రషీద్ Rasheed వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్యులు అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో అక్కడి నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసే సమాచారం దుండగులకు ముందే ఎలా తెలిసింది? ఇది లోపలి వ్యక్తుల ప్రమేయంతో జరిగిందా? లేక ముందుగా రెక్కీ నిర్వహించి దాడి చేశారా? అనే అనుమానాలతో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంక్ Bank క్యాష్ మూవ్మెంట్కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర మధ్యభాగంలో, రద్దీ ప్రాంతంలో ఉదయం వేళ జరిగిన ఈ కాల్పుల ఘటన నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.