అక్షరటుడే, బోధన్: Bodhan | మండలంలోని పలు సొసైటీల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Grain purchase centers) ప్రారంభమయ్యాయి. సొసైటీల స్పెషల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ మినార్పల్లి, అమ్దాపూర్లలో (Amdapur) కొనుగోళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 రెండో గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సొసైటీల కార్యదర్శులు హన్మాండ్లు, రాజేశ్వర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.