ePaper
More
    Homeభక్తిSrisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. ఆన్​లైన్​లో స్పర్శ దర్శనం టికెట్లు

    Srisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. ఆన్​లైన్​లో స్పర్శ దర్శనం టికెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Temple | శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారిని చూసి తరిస్తారు. అంతేగాకుండా స్వామి వారి స్పర్శ దర్శనం కోసం ఎంతో మంది పరితపిస్తారు. అయితే ప్రస్తుతం సామాన్య భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం అమలు చేస్తున్నాయి. అయితే ఒకేసారి భక్తులు అధికంగా వస్తుండడంతో స్పర్శ దర్శనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

    ఈ క్రమంలో ఆలయ అధికారులు స్పర్శ దర్శనానికి (Sparsha Darshan) టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆన్​లైన్​లో టోకెన్​ తీసుకున్న వారికే స్పర్శ దర్శనం అనుమతి ఉంటుంది. దీంతో భక్తుల రద్దీ తగ్గడంతో పాటు ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జులై 1 నుంచి ఆలయంలో స్పర్శ దర్శనం పున:ప్రారంభించారు. భక్తులు నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఆన్​లైన్​లో టోకెన్లు (Online Tokens) జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం అమలు చేస్తామన్నారు.

    వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు వివరించారు. ఇటీవల స్పర్శ దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో ఆన్​లైన్​ టోకెన్​ జారీ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. భక్తులు www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా స్పర్శ దర్శనం టోకెన్లు ఉచితంగా పొందవచ్చు.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...