MLA Madan Mohan | ముంపు ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.2.08కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో జారీ చేసింది. వీటిని నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ ముంపు ప్రాంతాల్లో జంగిల్​ క్లియరెన్స్​, ప్రవాహ మార్గంలో అడ్డంకులు తొలగించేందుకు వినియోగించనున్నారు. ఈ నిధుల విడుదలతో వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ వల్ల నష్టపోతున్న రైతులకు భారీ ఉపశమనం కలుగనుంది. వర్షాకాలంలో నిజాంసాగర్ […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.2.08కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో జారీ చేసింది. వీటిని నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ ముంపు ప్రాంతాల్లో జంగిల్​ క్లియరెన్స్​, ప్రవాహ మార్గంలో అడ్డంకులు తొలగించేందుకు వినియోగించనున్నారు.

ఈ నిధుల విడుదలతో వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ వల్ల నష్టపోతున్న రైతులకు భారీ ఉపశమనం కలుగనుంది. వర్షాకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురై పంట నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను మొదటి నుంచి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నష్టం కలగకుండా జంగిల్ క్లియరెన్స్ తప్పకుండా చేస్తానని ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు.

MLA Madan Mohan | శాసనసభలో ప్రస్తావన..

ఈ అంశాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ శాసనసభ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ని స్వయంగా కలిశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లో ముఖ్యంగా నాగిరెడ్డిపేట మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూల స్పందనతో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. దీంతో నిజాంసాగర్​ బ్యాక్​వాటర్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related articles

IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.