Homeజిల్లాలునిజామాబాద్​Excise Police | గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

Excise Police | గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Police | గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురిని ఎక్సైజ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కిలోలకుపైగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ స్వప్న (CI Swapna) ఆధ్వర్యంలో నగరంలోని అర్సపల్లి (Arsapally) వద్ద తనిఖీలు చేపట్టారు.

అర్సపల్లిలోని ఎన్‌ఎన్‌ ప్యాలెస్ వద్ద ఓ కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్​లోని (Hyderabad) బహదూర్ పురాకు (Bahadurpura) చెందిన మహమ్మద్ మునావర్, బాలాపూర్​నకు (balapur) చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, చాంద్రాయణ గుట్టకు (Chandrayan Gutta) చెందిన అమీర్ పాషా, నగరంలోని ముజాయత్ నగర్​కు చెందిన మహమ్మద్ అన్వర్​లను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 2.100 గ్రాముల ఏండు గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను విచారణ నిమిత్తం నిజామాబాద్​ ఎస్​హెచ్​వోకు అప్పగించారు. దాడుల్లో సీఐ స్వప్న, ఎస్సైలు రామ్‌కుమార్, చారి సిబ్బంది హమీద్, శివ, రాజన్న, భూమన్న, ఆశన్న, రాంబచ్చన్​, సాయిప్రసాద్ పాల్గొన్నారు.